కీటకాలు (ఆంగ్లం: Insects) ఇప్పటివరకు జీవించిన అన్ని జీవులకంటే అతి విజయవంతమైన సమూహం. ఇవి ఆర్థ్రోపోడా (Arthropoda) ఫైలంలో ఇన్సెక్టా (Insecta) తరగతికి చెందిన జీవులు. కీటక జాతుల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటే ఎక్కువ.
కీటకాల ముఖభాగాలు నోటిని ఆవరించి ఉండి ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు. ఓష్టం, హనువులు, జంభికలు, అధరం, అధోగ్రసని అనేవి కీటకాల ముఖభాగాలు. వివిధ కీటకాలలో వివిధ ముఖభాగాలుంటాయి.
ఇవి ఆడదోమ, సీసీ ఈగ, నల్లి వంటి రక్తాన్ని పీల్చుకొనే కీటకాలలో ఉంటాయి.
ఇవి ఈగలలో ఉంటాయి.
ఇవి సీతాకోకచిలుకలు, మాత్ లలో ఉంటాయి.
చాలా కీటకాలు మానవులకు చీడపురుగులు (Pests) గా సుపరిచితులు. కీటకాలలో దోమ, పేను, నల్లి వంటి కొన్ని పరాన్నజీవులు (Parasites), ఈగలు, దోమలు వంటి కొన్ని వ్యాధుల్ని కలుగజేస్తాయి, చెదపురుగులు నిర్మాణాల్ని, మిడతలు మొదలైనవి పంటల్ని పాడుచేస్తాయి. అయినా చాలామంది కీటక పరిశోధకులు కీటక నాశక మందుల (Insectisides) కంటే జీవసంబంధ చీడపురుగుల నివారణ పద్ధతుల (Biological pest control methods) నే ఉపయోగాన్ని సమర్ధిస్తున్నారు.
చాలా కీటకాలు పర్యావరణానికి, మానవులకు ఉపయోగకరమైనవి. కందిరీగ, తేనెటీగ, సీతాకోకచిలుకలు, చీమలు మొదలైన కొన్ని కీటకాలు పుష్పాలను పుప్పొడి రేణువులచే ఫలదీకరణం జరుపుతాయి. దీనిమూలంగా మొక్కల వృద్ధికి తోడ్పడుతున్నాయి. కీటకాల నాశనం మూలంగా ప్రస్తుత కాలంలో వీటిని వర్ధనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
కీటకాలు మనకు ఉపయోగపడే తేనె, మైనం, లక్క, పట్టు మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. తేనెటీగలను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. పట్టుపురుగులు మానవ చరిత్రను మార్చాయి. పట్టు రహదారి (Silk Road) చైనాను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. ఈగ లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.
.
చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు, వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.[1] అందువలననే ప్రాచీన ఈజిప్టు దేశాలలో పేడ పురుగులను పూజించేవారు.
కీటకాలన్నింటిలోని ఉపయోగమైనవి ఇతర కీటకాల్ని ఆహారంగా తినేవి. ఈ పద్ధతి కీటకాల జనాభాను నియంత్రించడానికి ముఖ్య కారణము. ఇదే గనక లేకపోతే వీటి జనాభా భూమినంతా ఆక్రమించేవి.[2]
కీటక సంహార పరికరాలు కీటకాలను సంహరించుటకు మానవుడు తయారుచేసుకున్న పరికరాలు. పురాతన కాలం నుండి మానవునికి కీటకాల నుండి హాని కలుగుతున్నది. వీటి బారినుండి రక్షించుకునుటకు వీటి తయారీని ప్రారంభించాడు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వివిధ పరికరాలను తయారు చేసుకున్నాడు.